హైదరాబాద్: ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ గెలిచి వచ్చింది బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు( PV Sindhu ). గతంలో రియో గేమ్స్లో ఆమె సిల్వర్ గెలిచినప్పుడు సింధుపై బహుమతుల వర్షం కురిసింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కోట్ల నగదు బహుమతులు ఇచ్చాయి. ఇక ఇతర వ్యక్తుల నుంచి కూడా ఆమెకు ఖరీదైన బహుమతులు ఎన్నో వచ్చాయి. ఇలా ప్లేయర్స్ ఎవరు ఏ విజయం సాధించినా ఖరీదైన కార్లు ఇచ్చే అలవాటున్న హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ చాముండేశ్వరినాథ్.. ఈసారి కూడా సింధుకు ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. గతంలో ఆమె ఏదో ఒక టోర్నీలో గెలిచిన ప్రతిసారీ కార్లు ఇస్తూ వచ్చారు. మరి ఈసారి ఏ కారు ఇవ్వబోతున్నారని అడగ్గా.. ఆమె దగ్గర ఇప్పటికే చాలా కార్లు ఉన్నాయి. అందుకే ఈసారి కారు కాకుండా మరో సర్ప్రైజ్ గిఫ్ట్ ఆమె కోసం వేచి చూస్తోంది అని చాముండేశ్వరినాథ్ చెప్పారు.