Lanka Premier League : ఐపీఎల్ 16వ సీజన్( IPL 2023) ముగిసి రెండు వారాలు కాకముందే మరో టీ20 లీగ్ మొదలవ్వనుంది. ఈసారి శ్రీలంక గడ్డపై పొట్టి క్రికెట్ టోర్నమెంట్ జరగనుంది. శ్రీలంక తొలిసారిగా లంక ప్రీమియర్ లీగ్(Lanka Premier League) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగానే ఈరోజు వేలం రిజిష్టర్ను విడుదల చేసింది. అందులో భారతదేశం నుంచి మాజీ క్రికెటర్ సురేశ్ రైనా(Suresh Raina) ఒక్కడి పేరు మాత్రమే ఉంది.
లంక ప్రీమియర్ లీగ్ వేలం జూన్ 14వ తేదీన జరగనుంది. మొత్తం ఐదు ఫ్రాంచైజీలు వేలం ప్రక్రియలో పాల్గొననున్నాయి. ఒక్కో ఫ్రాంచైజీ ఆటగాళ్ల కోసం 4 కోట్లు వెచ్చించనుంది. జూలై 31 నుంచి ఎల్పీఎల్ షురూ కానుంది. ఎల్పీఎల్ వేలంలో 360 మంది ఆటగాళ్లు పేర్లు రిజిష్టర్ చేసుకున్నారు. వీళ్లలో బాబర్ ఆజాం, మాథ్యూ వేడ్, డేవిడ్ మిల్లర్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు.
లంక ప్రీమియర్ లీగ్ వేలంలో పాల్గొంటున్న సురేశ్ రైనా
లెఫ్ట్ హ్యాండర్ అయిన సురేశ్ రైనా భారత క్రికెట్పై తన ముద్ర వేశాడు. యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీతో కలిసి ఫినిషర్గా భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. 2011 వరల్డ్ కప్, 2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో అతను సభ్యుడు. విధ్వంసక ఇన్నింగ్స్లతో చెలరేగే అతను ఐపీఎల్లోనూ ఇరగదీశాడు. చెన్నై సూపర్ కింగ్స్కు ఆడిన అతను చిన్న తాలగా పేరొందాడు. 110 మ్యాచుల్లో అతను 135.6 స్ట్రైక్రేటుతో 3,194 రన్స్ కొట్టాడు. అందులో ఒక సెంచరీ, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు 18 సార్లు 30 ప్లస్, 17 సార్లు 20 ప్లస్ స్కోర్ చేవాడు. గత ఏడాది సెప్టెంబర్లో రైనా ఐపీఎల్కు వీడ్కోలు పలికాడు.
పంజాబ్ కింగ్స్పై సెంచరీ కొట్టిన రైనా