Suresh Raina : ఐపీఎల్లో సూపర్ హిట్ కొట్టిన ఆల్రౌండర్లలో సురేశ్ రైనా(Suresh Raina) ఒకడు. చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన రైనా ఐపీఎల్ కెరీర్ను అర్ధాంతరంగా ముగించాడు. నాలుగేండ్ల క్రితం హోటల్ రూమ్ వివాదం కారణంగానే అతడు సీఎస్కేను వీడాడనే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే.. తాను ఏ పరిస్థితుల్లో సీఎస్కే నుంచి బయటికి రావాల్సి వచ్చిందో రైనా తాజాగా వెల్లడించాడు. ఐపీఎల్ 2020 ఎడిషన్ మధ్యలో మా మామయ్య చనిపోయారు. అందుకనే నేను అర్ధాంతరంగా జట్టును వీడాల్సి వచ్చింది. నేను వెళ్తున్నట్టు అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni), టీమ్ మేనేజ్మెంట్కు తెలియజేశాను అని రైనా వెల్లడించాడు.
రైనా వివాదంపై సీఎస్కే యజమాని ఎన్.శ్రీనివాసన్(N Srinivasan) ఏం చెప్పాడంటే.. కెప్టెన్ ధోనీకి కేటాయించినట్టుగానే తనకు కూడా విశాలమైన బాల్కనీ ఉన్న హోటల్ రూమ్ కావాలని రైనా కోరాడు. అందుకు మేము అంగీకరించలేదు. దాంతో, అతడు జట్టును వీడి వెళ్లిపోయాడు అని ఈ మధ్యే తెలిపాడు. దాంతో, తనపై శ్రీనివాసన్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని రైనా ఖండించాడు. తాను ప్రత్యేక గది అడిగాననడడం అబద్దమని, పంజాబ్లో తమ కుటుంబ సభ్యుడు ఒకరు మరణించడం వల్లే తాను టోర్నీ మధ్యలోనే వెళ్లిపోయానని రైనా అన్నాడు.
Remember how, Srinivasan deliberaly degraded Raina’s name by saying that he wanted a room with a balcony like MSD?
Suresh Raina opens up once again about that incident. Never Forget, Never Forgive.
Will never ever respect Srinivasan, a misogynistic money-whore. pic.twitter.com/JfgxwFCrHG
— Rᴀɪᴋᴀᴛ (@OverMidWicket) April 20, 2024
‘అప్పుడు మా కుటుంబంలో భయంకరమైన సంఘటన జరిగింది. మా అంకుల్ను ఎవరో దారుణంగా హత్య చేశారు. మా సోదరుడు, కజిన్స్ సైతం తీవ్రంగా గాయపడ్డారు. కొన్ని రోజుల మృత్యువుతో పోరాడిన మా కజిన్ కూడా కన్నుమూశాడు’ అని రైనా చెప్పుకొచ్చాడు.
సీఎస్కేలో చిన్న తాలగా పేరొందిన రైనా ఆ జట్టు తరఫున నాలుగు ట్రోఫీలు గెలిచాడు. విధ్వంసక ఇన్నింగ్స్లతో చెలరేగిన ఈ లెఫ్ట్ హ్యాండర్ చెన్నైకి 205 మ్యాచుల్లో ప్రాతినిధ్యం వహించాడు. 136.6 సగటుతో రైనా 5,528 పరుగులు సాధించాడు. 2022లో ఐపీఎల్, దేశవాళీ క్రికెట్కు వీడ్కోలు పలికిన రైనా ప్రస్తుతం యువ ఆటగాళ్లకు కోచింగ్ ఇస్తున్నాడు.