SurayKumar Yadav : టీమిండియా టీ20 సంచలనం, టీ20 వరల్డ్ నంబర్ 1 సూర్యకుమార్ యాదవ్ మరో ఘనత సాధించాడు. పొట్టి క్రికెట్లో అదరగొడుతున్న సూర్య, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, మాజీ క్రికెటర్ సురేశ్ రైనాను దాటేశాడు. భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఐదో బ్యాటర్గా నిలిచాడు. 44 ఇన్నింగ్స్లు ఆడిన సూర్య ఖాతాలో ప్రస్తుతం 1,625 రన్స్ ఉన్నాయి. ధోనీ 98 మ్యాచుల్లో 1,617, రైనా 78 గేమ్స్లో 1,605 పరుగులతో వరుసగా ఆరు, ఏడు స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 4,008 రన్స్తో అగ్రస్థానంలో ఉన్నాడు.
టీ20లో భారత పరుగుల వీరులు
1. విరాట్ కోహ్లీ – 4,008
2. రోహిత్ శర్మ – 3,853
3. కేఎల్ రాహుల్ – 2,265
4. శిఖర్ ధావన్ – 1,759
5. సూర్యకుమార్ యాదవ్ – 1,625
రాంచీలో న్యూజిలాండ్తో జరిగిన మొదటి టీ20లో సూర్య 34 బంతుల్లోనే 47 రన్స్ చేశాడు. అతడిని సోధి ఔట్ చేసి, మ్యాచ్ను మలుపు తిప్పాడు. గత ఏడాది విధ్వంసక ఇన్నింగ్స్లతో చెలరేగిన సూర్య ఐసీసీ మెన్స్ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా సెలక్ట్ అయ్యాడు. 2001, మార్చిలో భారత టీ20 జట్టుకి ఎంపికైన సూర్య అనతి కాలంలోనే జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. 360 డిగ్రీ ప్లేయర్గా మాజీలతో ప్రశంసలు అందుకుంటున్న అతను ఈ ఫార్మాట్లో ఇప్పటికి మూడు సెంచరీలు బాదాడు.