Anurag Thakur : భారత క్రికెట్ నియంత్రణ మండలి మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur)కు బిగ్ రిలిఫ్. నిషేధం కారణంగా దాదాపు పదేళ్లుగా క్రికెట్ వ్యవహారాలకు దూరమైన ఆయనకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఆయనపై కొనసాగుతున్న నిషేధాన్ని గురువారం అత్యున్నత న్యాయస్థానం ఎత్తివేసింది. దాంతో, బీసీసీఐ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు ఠాకూర్కు మార్గం సుగమమైంది.
ప్రస్తుతం బీజేపీ ఎంపీ, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్కు అడ్డంకులు తొలగిపోయాయి. నిషేధం కారణంగా 2017 నుంచి క్రికెట్ వవ్యహారాలకు దూరమైన ఠాకూర్ తనకు ఊరట కల్పించాలని సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. గురువారం ప్రధాన న్యాయమూర్తి ఇందియా సూర్యకాంత్, జస్టిస్ జయ్మాల్య బాగ్జీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణకు చేపట్టింది. ఠాకూర్పై విధించిన నిషేధం జీవితకాలం కొనసాగదని, ఇప్పటికే ఆయన తొమ్మిదేళ్లు క్రికెట్ కార్యకలాపాలకు దూరమయ్యారని ధర్మాసనం పేర్కొంది.
Supreme Court lifts ban on BJP MP Anurag Thakur
SC: Anurag Thakur can now hold office in the BCCI
2017: SC barred him from the board over non-compliance with reforms@harishvnair & @HeenaGambhir with more details. pic.twitter.com/3BpSyGp23i
— TIMES NOW (@TimesNow) February 5, 2026
లోధా కమిటీ సిఫార్సులను తిరస్కరించినందుకు అనురాగ్ ఠాకూర్ నిషేధానికి గురయ్యారు. అప్పటి సీజేఐ టీఎస్ ఠాకూర్ ఆయనను బీసీసీఐ అధ్యక్ష స్థానం నుంచి తొలగించారు. బీసీసీఐలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొచ్చే ఉద్దేశంతో లోధా కమిటీ సిఫారసులు చేయగా.. ఠాకూర్ మాత్రం అంగీకరించలేదు. బీసీసీఐ ప్రభుత్వ జోక్యంలేదని ఐసీసీకి తప్పులతో కూడిన నివేదిక సమర్పించారు. దాంతో, ధిక్కారం కింద ఆరోపణలు ఎదుర్కొన్న ఠాకూర్ క్షమాపణలు తెలిపారు. కానీ, జూలై నెల నుంచి ఆయనపై ఈరోజు వరకూ నిషేధం కొనసాగింది.