పూరన్నూ రిలీజ్ చేసిన సన్రైజర్స్
న్యూఢిల్లీ: ఐపీఎల్ మినీ వేలానికి ముందు.. సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం అనూహ్య నిర్ణయాలు తీసుకుంది. గతేడాది స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ను వదులుకున్న ఫ్రాంచైజీ.. తాజాగా కెప్టెన్ కేన్ విలియమ్సన్ను జట్టు నుంచి రిలీజ్ చేసింది. విలియమ్సన్తో పాటు విండీస్ విధ్వంసక ఆటగాడు నికోలస్ పూరన్ను కూడా వేలానికి వదిలేసింది. మరి మినీ వేలంలో వీరిని తిరిగి దక్కించుకుంటుందా లేక.. జట్టును కొత్తగా ఎంపిక చేసుకుంటుందా చూడాలి. ప్రస్తుతం మొత్తం పది జట్లలో సన్రైజర్స్ హైదరాబాద్ వద్దే అత్యధిక మొత్తం (రూ. 42.25 కోట్లు) అందుబాటులో ఉంది. గత సీజన్లో పంజాబ్ కింగ్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన మయాంక్ అగర్వాల్ను ఆ జట్టు రిలీజ్ చేయడంతో ప్రస్తుతం పంజాబ్ వద్ద రూ. 32.25 కోట్ల నగదు ఉంది. అయితే ఈ వేలానికి ముందు అన్నీ జట్లకు అదనంగా మరో ఐదేసి కోట్లు కేటాయించనున్నారు. వచ్చే నెల 23న కొచ్చి వేదికగా మినీ వేలం జరుగనుంది.