Sunrisers | ముంబై: సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ప్యాట్ కమిన్స్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. గత కొన్ని సీజన్లుగా వ్యవహరిస్తున్న ఎయిడెన్ మార్క్మ్న్రు కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ సన్రైజర్స్ యాజమాన్యం కమిన్స్ను నియమించింది. ఈ విషయాన్ని తమ అధికారిక సోషల్మీడియా వేదికగా సోమవారం ప్రకటించింది. ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో రికార్డు స్థాయిలో కమిన్స్ను రూ.20.50 కోట్లకు సన్రైజర్స్ దక్కించుకుంది. మిగతా ఫ్రాంచైజీలను వెనుకకు నెడుతూ రేసులో కొనసాగిన హైదరాబాద్ ఎట్టకేలకు కమిన్స్ను తమ వశం చేసుకుంది.
గత సీజన్లుగా ప్లేఆఫ్స్ చేరలేక లీగ్ దశకే పరిమితమవుతూ వస్తున్న హైదరాబాద్ ఈసారైనా తమ ప్రదర్శన మెరుగుపర్చుకోవాలని చూస్తున్నది. కెప్టెన్గా నియామకంపై కమిన్స్ స్పందిస్తూ భారత్ నాకు రెండో ఇళ్లు లాంటిది. ఐపీఎల్ ద్వారా మేము ఇక్కడ చాలా రోజులు గడిపాం. ఇక్కడ ఆయా నగరాలకు చెందిన జట్లకు ప్రాతినిధ్యం వహించడం మరిచిపోలేనిది. ఫ్యాన్స్ ఎప్పుడు కలిసినా తమ అభిమానాన్ని చాటుకుంటారు. మీరు కోల్కతా(పాత జట్టు) టీమ్ కదా అంటూ అప్యాయంగా పలకరిస్తుంటారు. రానున్న సీజన్లో హైదరాబాద్కు ఆడుతుండటం కొత్త అనుభూతిని ఇవ్వబోతున్నది’ అని అన్నాడు.