యోచియాన్(దక్షిణకొరియా): ప్రతిష్ఠాత్మక ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత ప్లేయర్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. మంగళవారం జరిగిన మహిళల 4X 100 రిలేలో తమన్నా, అక్షయ, నయన కొకరే, అభినయతో కూడిన భారత బృందం (45.36సె) కాంస్య పతకం సొంతం చేసుకుంది.
పురుషుల 4X100 మీటర్ల రిలేలో హిమతేజ, అర్జిత్ రానా, రియాన్ బాషా, జయరామ్ బృందం కాంస్య పతకం దక్కించుకుంది.