ముంబై: టీ20 వరల్డ్కప్ కోసం త్వరలోనే టీమిండియా( Team India )ను ప్రకటించనుంది బీసీసీఐ. అయితే ఆ లోపే లెజెండరీ బ్యాట్స్మన్ సునీల్ గవాస్కర్ తన టీమ్ను ప్రకటించాడు. 15 మంది సభ్యులతో ఇది తాను ఎంపిక చేసిన టీమ్ అని సన్నీ చెప్పాడు. అయితే గవాస్కర్ టీమ్లో శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్లకు స్థానం దక్కకపోవడం విశేషం. అంతేకాదు రోహిత్ శర్మతో కలిసి కెప్టెన్ విరాట్ కోహ్లిని ఓపెనర్గా ప్రకటించాడు. మూడో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ను సెలక్ట్ చేశాడు. హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలతోపాటు మరో ఇద్దరు ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్లకు కూడా సన్నీ తన టీమ్లో చోటిచ్చాడు.
ఇదీ గవాస్కర్ టీ20 వరల్డ్కప్ టీమ్: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, భువనేశ్వర్కుమార్, దీపక్ చహర్, శార్దూల్ ఠాకూర్, యజువేంద్ర చాహల్.