దుబాయ్: సలహాదారు వీలైనంత సహాయం చేస్తాడు కానీ మ్యాచ్ ఆడాల్సిందల్లా క్రికెటర్లేనని లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ తెలిపాడు. అవసరమైతే వ్యూహం రచించడంలో మెంటార్ భాగమవుతాడు అని చెప్పాడు. టైమౌట్ సమయంలో బ్యాటర్లు, బౌలర్స్తో సమాలోచనలు చేయొచ్చు కానీ మ్యాచ్లో ఆటగాళ్లే ప్రదర్శన కనబర్చాలని స్పష్టం చేశాడు. ‘కెప్టెన్సీని వదులుకుంటుండడంతో కోహ్లీ ఒత్తిడి లేకుండా తన ఆటపై దృష్టి సారించాలి. కెప్టెన్గా సొంత నిర్ణయాలు తీసుకోకుండా జట్టు సభ్యులతో బ్యాటింగ్, బౌలింగ్ విషయాలపై చర్చించాలి’ అని సూచించాడు. భారత జట్టు లోపాలను గవాస్కర్ లేవనెత్తాడు. ‘జట్టు కూర్పు లోపంతోనే అంతర్జాతీయ టోర్నీ నాకౌట్స్లో భారత్ బోల్తా పడుతున్నది. నాకౌట్స్, ఫైనల్స్లో మొదట బ్యాటింగ్కు దిగి ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలి. అప్పుడే విజయం మనదేవుతుంది. పవర్ ప్లే తర్వాత 7 నుంచి 12 ఓవర్ల మధ్య భారత్ తడబడుతున్నది. ఎవరూ ఫేవరెట్ కాదని భావిస్తే తక్కువ తప్పిదాలతో విజయం పొందవచ్చు. అందరూ తమ మేథాశక్తితో పాటు అన్ని సామర్థ్యాలను వందశాతం ఉపయోగించాలి’ అని క్రికెట్ దిగ్గజం గవాస్కర్ సూచించాడు.