న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో సుదీర్ఘ ఫార్మాట్లోనూ దూకుడైన ఆటతో మోతమోగిస్తున్న ఇంగ్లండ్ ‘బజ్బాల్’ గేమ్కు.. టీమ్ఇండియా ‘విరాట్బాల్’ సరైన కౌంటర్ అని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నాడు. భారత్, ఇంగ్లండ్ మధ్య గురువారం నుంచి ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ‘ప్రస్తుతం కోహ్లీ మంచి ఫామ్లో ఉన్నాడు. ఇంగ్లండ్ బజ్బాల్కు సమాధానమిచ్చేందుకు మన దగ్గర ‘విరాట్బాల్’ ఉంది. సుదీర్ఘ ఫార్మాట్ను ఎంతగానో ఇష్టపడే కోహ్లీ.. టెస్టుల్లో అర్ధశతకాల కంటే.. శతకాలే ఎక్కువ చేశాడు’ అని సన్నీ అన్నాడు.