ఇండియన్ వెల్స్ (అమెరికా): ఇండియన్ వెల్స్ మాస్టర్స్ టోర్నీలో భారత యువ టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నాగల్ అదిరిపోయే శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ పోరులో నాగల్ 6-2, 6-2తో అమెరికా వైల్డ్కార్డ్ ఎంట్రీ ప్లేయర్ స్టెఫాన్ డొస్టానిక్పై అలవోక విజయం సాధించాడు.
ఎనిమిదో సీడ్గా బరిలోకి దిగిన నాగల్ 68 నిమిషాల్లో ప్రత్యర్థిని చిత్తు చేసి టోర్నీలో ముందంజ వేశాడు. ఆది నుంచే తనదైన దూకుడు కనబరిచిన ఈ భారత నంబర్వన్ ప్లేయర్ సింగిల్ బ్రేక్పాయింట్ను ఎదుర్కొకుండా మ్యాచ్ను కైవసం చేసుకున్నాడు.