న్యూఢిల్లీ: భారత యువ టెన్నిస్ ఆటగాడు సుమీత్ నాగల్ ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. కరోనా వైరస్ కారణంగా ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్న క్రీడల నుంచి పలువురు ఆటగాళ్లు తప్పుకోవడంతోర్యాంకింగ్స్ ఆధారంగా నాగల్ ముందడుగు వేశాడు. ఈ మేరకు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) శుక్రవారం భారత టెన్నిస్ సంఘానికి (ఐటా) సమాచారం ఇచ్చింది. గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు నాగల్కు ఈ అవకాశం దక్కింది. జూన్ 14న విడుదలైన ఏటీపీ ర్యాంకింగ్స్ ప్రకారం నాగల్ 144వ ర్యాంక్లో ఉండగా.. అతడి కంటే మెరుగైన స్థానంలో ఉన్న యూకీ బాంబ్రీ (130) గాయంతో బాధపడుతుండటంతో నాగల్కు ఈ చాన్స్ వచ్చింది. కాగా, పురుషుల డబుల్స్లోనూ బోపన్నతో కలిసి నాగల్ బరిలోకి దిగనున్నాడు.