IND vs AUS : టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా(25) ఔటయ్యాడు. స్టోయినిస్ ఓవర్లో పాండ్యా గాల్లోకి లేపిన బంతిని గ్రీన్ బౌండరీ వద్ద క్యాచ్ పట్టాడు. దాంతో, 83 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్ పడింది. కేఎల్ రాహుల్ (26)తో కలిసి ఐదో వికెట్కు పాండ్యా 44 రన్స్ జోడించాడు. రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు. 20 ఓవర్లకు ఐదు వికెట్ల నష్టానికి 83 రన్స్ చేసింది.
అంతకుముందు మిచెల్ స్టార్క్ ఓవర్లో లబుషేన్ కవర్స్లో డైవింగ్ క్యాచ్ పట్టడంతో ఓపెనర్ శుభ్మన్ గిల్ (20) వెనుదిరిగాడు. 39 రన్స్కే భారత్ నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం కెప్టెన్ హార్దిక్ పాండ్యా (6), క్రీజులో ఉన్నారు. ఒకే ఓవర్లో స్టార్క్, విరాట్ కోహ్లీ(4), సూర్యకుమార్ యాదవ్ (0)ను ఎల్బీగా వెనక్కి పంపాడు. దాంతో, 16 రన్స్ వద్ద భారత జట్టు మూడో వికెట్ పడింది.