హైదరాబాద్, ఆట ప్రతినిధి: భోపాల్ వేదికగా జరుగుతున్న 17వ జాతీయ యూత్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ ప్లేయర్ ప్రణయ్ పసిడి పతకంతో మెరిశాడు. శనివారం జరిగిన బాలుర ట్రిపుల్ జంప్ ఫైనల్లో ప్రణయ్ 14.83మీటర్ల దూరం దూకి స్వర్ణాన్ని ఖాతాలో వేసుకున్నాడు.
ఎస్సీ గురుకుల విద్యాలయంలో ప్రస్తుతం విద్యనభ్యసిస్తున్న ఈ యువ అథ్లెట్ గత కొంత కాలంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. జాతీయ యూత్ అథ్లెటిక్స్ టోర్నీలో ప్రణయ్ పతకం సాధించడంపై గురుకుల విద్యాసంస్థల అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.