హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ యాచింగ్ అసోసియేషన్(వైఏఐ) ఆధ్వర్యంలో మేఘాలయలో తొలిసారి జరిగిన నార్త్ఈస్ట్ రెగెట్టా చాంపియన్షిప్లో రాష్ట్ర సెయిలర్లు సత్తాచాటారు. అద్భుత ప్రదర్శన కనబరుస్తూ తొమ్మిది పతకాలు సొంతం చేసుకున్నారు.
మిక్స్డ్ 420 విభాగంలో రాష్ట్ర ద్వయం అలేఖ్య, అఖిల్ స్వర్ణ పతకంతో పాటు లక్ష రూపాయల నగదు బహుమతి అందుకున్నారు. మరోవైపు లాహిరి కొమురవెల్లి పసిడితో పాటు 50వేల నగదు దక్కించుకుంది. లాహిరి సోదరి దీక్షిత రజతం సొంతం చేసుకోగా, మిగతా సెయిలర్లు కాంస్యాలు ఖాతాలో వేసుకున్నారు.