ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారంలోని కొమురం భీం స్టేడియంలో రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడలు రెండో రోజూ హోరాహోరీగా సాగాయి. ప్లేయర్లు పతకసాధనలో విజృంభించారు. అండర్-14 బాలుర కబడ్డీ విభాగంలో ఉట్నూరు జోన్పై ఏటూరు నాగారం జోన్ టీమ్ గెలువగా, బౌలికల విభాగంలో మైదాన ప్రాంత జోన్పై ఏటూరునాగారం పైచేయి సాధించింది. వాలీబాల్ అండర్-17 బాలుర కేటగిరీలో మైదానప్రాంత జట్టు ఏటూరునాగారంపై గెలువగా, బాలికల విభాగంలో భద్రాచలం జోన్ టీమ్..ఉట్నూర్ను ఓడించింది. అథ్లెటిక్స్ బాలుర అండర్-17 విభాగంలో భద్రాచలం జోన్కు చెందిన వెంకటేశ్వర్రావు ప్రథమస్థానంలో నిలువగా, ఉట్నూరు-2 జోన్కు చెందిన ప్రశాంత్, సంతోష్కు ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కాయి.
ఆర్చరీ ఓవరాల్ చాంప్ భద్రాచలం: ఆర్చరీ ఓవరాల్ చాంపియన్షిప్ను భద్రాచలం జట్టు కైవసం చేసుకుంది. అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన భద్రాచలం అండర్-17 బాలికల విభాగంలో సునంద, కల్పన, సాత్విక, వీ కల్పన విజేతలుగా నిలిచారు. 30 మీటర్ల విభాగంలో సునంద, కల్పన(భద్రాచలం), సుమిత్ర(ఉట్నూరు) టైటిళ్లను సొంతం చేసుకున్నారు. టీమ్ చాంపియన్షిప్లో
భద్రాచలం టాప్లో నిలిచింది.