కురవి, నవంబర్ 01: మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్(ఈఎంఆర్ఎస్) సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు మంగళవారం మొదలయ్యాయి. నాలుగు రోజుల పాటు జరిగే టోర్నీలో 23 ఈఎంఆర్ఎస్ పాఠశాలల నుంచి 1300 మంది ప్లేయర్లు, పీఈటీలు, క్రీడాధికారులు హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ శశాంక, ఐటీడీఏ పీవో అంకిత్తో కలిసి జ్యోతి ప్రజల్వన చేసి పోటీలను ప్రారంభించారు. విద్యార్థిని, విద్యార్థులు మార్చ్ఫాస్ట్, సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ ఆకట్టుకున్నారు. ప్లేయర్లను కలెక్టర్ పరిచయం చేసుకుని వారిలో ఉత్సాహాన్ని నింపారు. తొలి రోజు వివిధ విభాగాల్లో పోటీలు హోరాహోరీగా సాగాయి. కబడ్డీ, తైక్వాండో, వాలీబాల్, బాక్సింగ్ క్రీడలను వేదికపై పరిచయం చేశారు. బాలుర అండర్-19 800మీటర్ల విభాగంలో నరేశ్ విజేతగా నిలిచాడు.