జనగామ చౌరస్తా: వరంగల్ పోలీస్ కమీషనరేట్ (వెస్ట్జోన్) సారథ్యంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు బుధవారం హోరాహోరీగా సాగాయి. పురుషుల విభాగంలో ఆదిలాబాద్తో జరిగిన మ్యాచ్లో వరంగల్ 43-19 తేడాతో ఘన విజయం సాధించింది. మిగతా మ్యాచ్ల్లో నిజామాబాద్ 26-25తో కరీంనగర్పై, రంగారెడ్డి 34-15తో ఆదిలాబాద్పై, మహబూబ్నగర్ 32-15తో మెదక్పై, హైదరాబాద్ 36-29తో ఖమ్మంపై విజయాలు సాధించాయి. మహిళల కేటగిరీలో డీసీపీ వెస్ట్జోన్ 40-6తో ఏసీపీ వర్ధన్నపేటపై, సీపీ వరంగల్ 40-29తో ఏసీసీ జనగామపై, ఏసీపీ ఘన్పూర్ 39-13తో ఏసీపీ వర్ధన్నపేటపై గెలిచి ముందంజ వేశాయి. గురువారం సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లు జరుగుతాయని నిర్వహకులు తెలిపారు.