హైదరాబాద్, ఆట ప్రతినిధి: విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి మనుమడు ఇంద్రారెడ్డి రాష్ట్ర స్థాయి చెస్ టోర్నీలో చాంపియన్గా అవతరించాడు. హైదరాబాద్ వేదికగా జరిగిన 35వ తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్ అండర్-9 ఓపెన్ చెస్ టోర్నీలో మంత్రి సబిత తనయుడు కార్తీక్ రెడ్డి కుమారుడు ఇంద్రారెడ్డి అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఐదు రౌండ్లలో ప్రత్యర్థులను చిత్తు చేశాడు. ఓటమెరుగకుండా దూకుడుగా ఆడుతూ వరుసగా ఐదు పాయింట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. తవీశ్ సింగ్తో పాయింట్లు సమం చేసుకున్నా.. ఇంద్రారెడ్డి తన మెరుగైన ప్రదర్శనతో టైటిల్ను కైవసం చేసుకున్నాడు. తన మనుమడి ప్రతిభను చూసి మంత్రి సబిత మురిసిపోయారు. భవిష్యత్లో మరింత రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇంద్రారెడ్డి రాణించాలని మంత్రి ఆకాంక్షించారు.