ప్రముఖ క్రికెటర్, ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జేసర్ రాయ్పై ఈసీబీ (ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు) ఆగ్రహం వ్యక్తం చేసింది. బోర్డు నిబంధనలను రాయ్ ఉల్లంఘించాడని పేర్కొంది. ఈ క్రమంలోనే అతనిపై రెండు మ్యాచుల నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, 2500 పౌండ్ల జరిమానా కూడా విధించింది.
ఈ జరిమానాను ఈ నెల 31 లోపు చెల్లించాలని ఆదేశించింది. వివక్షా పూరిత ప్రవర్తనను రాయ్ చూపించాడని ఈసీబీ వెల్లడించింది. తను తప్పు చేసినట్లు రాయ్ కూడా అంగీకరించినట్లు సమాచారం. ‘‘జేసన్ రాయ్ తప్పు చేసినట్లు ఒప్పుకోవడంతో డిసిప్లినరీ ప్యానెల్ తీర్పు వెలువరించింది. రాయ్ ప్రవర్తన ఈసీబీతోపాటు క్రికెట్ క్రీడకు కూడా అపకీర్తి తెచ్చేలా ఉంది. ఈసీబీ డైరెక్టివ్ 3.3 నిబంధనను అతను ఉల్లంఘించాడు’’ అని ఈసీబీ వెల్లడించింది.
అన్ని వర్గాల వాదనలు విన్న తర్వాత రెండు మ్యాచుల పాటు రాయ్పై నిషేధం విధించాలని, అలాగే అతను 2500 పౌండ్లు జరిమానా చెల్లించాలని డిసిప్లినరీ ప్యానెల్ తేల్చిచెప్పింది. అయితే రాయ్ ప్రవర్తన బాగుంటే ఈ నిషేధాన్ని 12 నెలల పాటు వాయిదా వేయొచ్చని సూచించింది.