న్యూఢిల్లీ: స్టార్ ఇండియన్ బ్యాటర్(Indian Batter) కేఎల్ రాహుల్ .. ఇంగ్లండ్తో జరిగిన గత మూడు టెస్టులకు గాయం వల్ల దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ధర్మశాలలో జరగనున్న ఫైనల్ గేమ్కు కూడా అతను దూరం అయ్యే ఛాన్సు కనిపిస్తోంది. ఇంగ్లండ్తో జరిగిన ఫస్ట్ టెస్ట్ సమయంలో తొడ కండరాలు పట్టేయడంతో గాయపడ్డ కేఎల్ రాహుల్ ఇంకా కోలుకోనట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో అతను రికవరీ కాకపోవడంతో అతన్ని బీసీసీఐ లండన్కు పంపింది. నిపుణుల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు అతన్ని లండన్కు పంపినట్లు బీసీసీఐ వర్గాల ద్వారా స్పష్టం అవుతోంది. వాస్తవానికి మూడవ టెస్టు ఆడేందుకు కేఎల్ రాహుల్కు క్లియరెన్స్ దక్కినా… చివరి నిమిషంలో మళ్లీ అతన్ని తప్పించారు. ఒకవేళ రాహుల్ రికవరీ అయితే అతన్ని ఆడించాలనుకున్నారు. కానీ ఇప్పటికే ఈ సిరీస్లో ఇండియా లీడింగ్లో ఉన్న కారణంగా అతనికి మరింత రెస్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. టీ20 వరల్డ్కప్ను దృష్టిలో పెట్టుకుని కేఎల్ రాహుల్కు మరింత టైం ఇచ్చినట్లు అర్థమవుతోంది.