ITF Tourney | హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఇండోర్ టెన్నిస్ క్లబ్ వేదికగా జరిగిన ఐటీఎఫ్ వరల్డ్ టెన్నిస్ టూర్ టోర్నీలో శ్రీవల్లి రష్మిక, వైదేహి చౌదరీ జోడీ విజేతగా నిలిచింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో రష్మిక, వైదేహి ద్వయం 6-3, 7-5తో హుసన్ లీ, సోహున్ పార్క్ జోడీపై విజయం సాధించింది.
ఆది నుంచే తమదైన జోరు కనబరిచిన రష్మిక, వైదేహి..ప్రత్యర్థి జంటను వరుస సెట్లలో చిత్తు చేసింది.