న్యూఢిల్లీ :గుజరాత్లో ఈ నెల 29నుంచి జరుగనున్న జాతీయ క్రీడల్లో మేటి క్రీడాకారులు పాల్గొననున్నారు. వారిలో ఇటీవలి కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన స్టీపుల్ చేజర్ అవినాశ్ సాబల్, లాంగ్జంపర్ మురళీ శ్రీశంకర్, మహిళా జావెలిన్ త్రోయర్ అన్నురాణి, ప్రముఖ మహిళా అథ్లెట్లు హిమదాస్, ద్యుతీ చంద్, జాతీయ మహిళల 100మీ. హర్డిల్స్ రికార్డు హోల్డర్, ఆంధ్ర క్రీడాకారిణి జ్యోతి యర్రాజి, తదితరులు పాల్గొంటున్నారు.