హైదరాబాద్, ఆట ప్రతినిధి: శ్రీనిధి బీ-డబ్స్ వర్సిటీ బాస్కెట్బాల్ టోర్నీకి ఈ నెల 18వ తేదీన తెరలేవనుంది. మొత్తం 14 స్కూళ్ల నుంచి దాదాపు 100 మందికి పైగా ప్లేయర్లు ఈ టోర్నీలో పోటీపడబోతున్నారు. అమెరికాలో బాస్కెట్బాల్ లీగ్ తరహాలో దేశంలో తొలిసారి ఈ చాంపియన్షిప్ రూపొందించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
పాఠశాల స్థాయి నుంచే లెబ్రాన్ జేమ్స్, స్టిఫెన్ కర్రీ, కోబ్ బ్రయాంట్ లాంటి దిగ్గజ బాస్కెట్బాల్ ప్లేయర్లు వచ్చారని భవిష్యత్లో మన దగ్గర అలాంటి ప్లేయర్లను వెలుగులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో నిర్వహిస్తున్నట్లు లీగ్ ఫౌండర్ రిత్విక్ తెలిపాడు. దేశంలో బాస్కెట్బాల్ క్రీడను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని వివరించాడు.