World Cup 2023 | వన్డే ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం పాలైన శ్రీలంకకు మరో షాక్ తగిలింది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు.. ఇప్పటికే సఫారీల చేతిలో ఓటమితో ఇబ్బంది పడుతున్న లంక ప్లేయర్లపై ఐసీసీ జరిమానా విధించింది. మెగాటోర్నీలో భాగంగా శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన పోరులో.. స్లో ఓవర్ రేట్కు పాల్పడ్డందుకు లంక ప్లేయర్ల మ్యాచ్ ఫీజు నుంచి 10 శాతం కోత విధిస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. పరుగుల వరద పారిన పోరులో శ్రీలంక నిర్ణీత సమయంలో రెండు ఓవర్లు తక్కువగా వేసింది. దీంతో ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ 2.22 ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్లు మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ వెల్లడించాడు. నిర్ణీత సమయంలో పూర్తి చేయలేకపోయిన ఒక్కో ఓవర్కు 5 శాతం మ్యాచ్ ఫీజును జరిమానా విధించడం పరిపాటి కాగా.. రెండు ఓవర్లకు గానూ లంక ప్లేయర్ల మ్యాచ్ ఫీజు నుంచి 10 శాతం కోత వేశారు.
వరల్డ్కప్కే వన్నెతెచ్చేలా సాగిన దక్షిణాఫ్రికా, శ్రీలంక పోరులో సఫారీ జట్టు 102 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచకప్లోనే అత్యధిక స్కోరు చేసిన జట్టుగా దక్షిణాఫ్రికా రికార్డుల్లోకెక్కగా.. పెనర్ క్వింటన్ డికాక్ (84 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్సర్లు), వాన్ డెర్ డసెన్ (110 బంతుల్లో 108; 13 ఫోర్లు, 2 సిక్సర్లు), ఎయిడెన్ మార్క్రమ్ (54 బంతుల్లో 106; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీలతో దుమ్మురేపారు. లక్ష్యఛేదనలో క్వింటన్ డికాక్ (84 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్సర్లు), వాన్ డెర్ డసెన్ (110 బంతుల్లో 108; 13 ఫోర్లు, 2 సిక్సర్లు), ఎయిడెన్ మార్క్రమ్ (54 బంతుల్లో 106; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది.