కొలంబో: ఒకప్పుడు ప్రపంచ క్రికెట్ను ఏలిన శ్రీలంక ఇప్పుడు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దశాబ్ద కాలం కిందటితో పోలిస్తే ఇప్పుడు టీమ్ పూర్తిగా బలహీనంగా మారడం, వరుస ఓటములు, బోర్డుతో క్రికెటర్ల విభేదాలు.. శ్రీలంక క్రికెట్ను కష్టాల్లోకి నెట్టాయి. కాంట్రాక్ట్పై సంతకం చేయడానికి అక్కడి స్టార్ క్రికెటర్లు నో అంటున్నారన్న వార్తల నేపథ్యంలో సీనియర్ ప్లేయర్ ఏంజిలో మాథ్యూస్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైరయ్యే ఆలోచనలో ఉన్నట్లు సమచారం. త్వరలోనే అతడు ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డుకు చెప్పే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వన్డేలు, టీ20ల నుంచి తనను తప్పించడంపై మాథ్యూస్ అసంతృప్తితో ఉన్నాడు. యువ ఆటగాళ్లకు చాన్సిచ్చే పేరుతో లంక సెలక్టర్లు అతన్ని పక్కనపెట్టారు.
అయితే కొంతకాలం శ్రీలంక క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న చాలా తక్కువ మంది ప్లేయర్స్లో మాథ్యూస్ ఒకడు. అలాంటి ప్లేయర్ను తప్పించడం చాలా మంది ఆశ్చర్యానికి గురి చేసింది. 2017లో అతని సగటు 63, 2018లో 52 కాగా.. 2019 వరల్డ్కప్లో లంక్ టీమ్ తరపున బెస్ట్ బ్యాట్స్మన్ కూడా అతడే. అయితే తాజాగా లంక బోర్డు కాంట్రాక్ట్ను వ్యతిరేకిస్తూ తిరుగుబాటు చేసిన ప్లేయర్స్ను కూడా మాథ్యూసే ముందుండి నడిపిస్తున్నా.. అనూహ్యంగా అతడు కాంట్రాక్ట్పై సంతకం చేయడానికి అంగీకరించాడు. 2009లో అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చిన మాథ్యూస్ లంక తరఫున 90 టెస్టులు, 218 వన్డేలు, 78 టీ20లు ఆడాదు. మొత్తం 13,219 పరుగులు, 218 వికెట్లు తీయడం విశేషం.