హైదరాబాద్ : భారత్, శ్రీలంక(SL Vs Ind) మధ్య జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్లో(1st ODI Match) శ్రీలంక 7 పరుగుల వద్ద తన మొదటి వికెట్ను కోల్పోయింది. సిరాజ్(Siraj) వేసిన రెండో ఓవర్లో ఆవిష్క ఫెర్నాండో(1) హర్షదీప్ సింగ్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. పాతుమ్ నిస్సంక క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం శ్రీలంక స్కోర్ 5.2 ఓవర్లలో 14/1. కాగా, మూడు వన్డేల సిరీస్లో భాగంగా కొలంబో వేదికగా శుక్రవారం ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరుగనుంది.
ఈ నేపథ్యంలో ముందుగా టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. టీ20లకు వీడ్కోలు పలికిన స్టార్ ప్లేయర్లు రోహిత్, కోహ్లీ తిరిగి జట్టులోకి రావడం టీమ్ఇండియాకు అదనపు బలం కానుంది. అలాగే చాలా రోజుల తర్వాత కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్కు తుది జట్టులో చోటు దక్కింది. కాగా, ఇటీవల మరణించిన ఫార్మర్ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్ మృతికి సంతాప సూచకంగా భారత క్రికెటర్లు నల్లబ్యాడ్జీలు ధరించి తెలిపారు.