క్రైస్ట్చర్చ్: టాపార్డర్ సమిష్టిగా సత్తాచాటడంతో న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక భారీ స్కోరు దిశగా సాగుతున్నది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన లంక గురువారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లకు 305 పరుగులు చేసింది.
కుశల్ మెండిస్ (87), కెప్టెన్ దిముత్ కరుణరత్నె (50), ఏంజెలో మాథ్యూస్ (47), దినేశ్ చండిమల్ (39), ధనంజయ డిసిల్వ (39 బ్యాటింగ్) రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో కెప్టెన్ టిమ్ సౌథీ 3, మ్యాట్ హెన్రీ రెండు వికెట్లు పడగొట్టారు.