వెల్లింగ్టన్: ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్నకు శ్రీలంక నేరుగా అర్హత సాధించలేకపోయింది. న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో లంక 0-2తో వైట్వాష్కు గురవడంతో మెగాటోర్నీ బెర్త్ దక్కించుకోలేకపోయింది. శుక్రవారం జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో లంకను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన లంక 41.3 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది.
ఓపెనర్ పతుమ్ నిషాంక (57) అర్ధశతకంతో రాణించగా.. మిగిలినవాళ్లంతా విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, షిప్లే, డారిల్ మిషెల్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 32.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. విల్ యాంగ్ (86 నాటౌట్; 11 ఫోర్లు), హెన్రీ నికోల్స్ (44 నాటౌట్) రాణించారు.