గాలె : శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఐర్లాండ్ ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోడానికి ఎదురీదుతున్నది. నాలుగో రోజు ఆట ముగిసేసరికి ఐర్లాండ్ తమ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్లకు 54 పరుగులు చేసింది. అంతకుముందు శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్ను 3 వికెట్లకు 704 పరుగులవద్ద డిక్లేర్ చేసింది.
ఓపెనర్ నిషాన్ మదుష్క(205), కుశాల్ మెండిస్(245) డబుల్ సెంచరీలతోపాటు, మాథ్యూస్ (100 నాటౌట్) లంక భారీస్కోరుకు దారితీసింది. దీనితో ఆతిథ్య జట్టుకు 212 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఇన్నింగ్స్ పరాజయం తప్పించుకోవాలంటే ఐర్లాండ్ ఇంకా 158 పరుగులు చేయాల్సి ఉంది.