రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ముందు భారీ టార్గెట్ నిలిచింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన రాజస్థాన్ ఆటగాళ్లు 20 ఓవర్లు ముగిసే సరికి 210 పరుగుల భారీ స్కోరు సాధించారు. ఓపెనర్లు జోస్ బట్లర్ (35), యశస్వి జైస్వాల్ (20) శుభారంభం అందించగా.. ఆ తర్వాత దేవదత్ పడిక్కల్ (41), కెప్టెన్ సంజు శాంసన్ (55) అదిరిపోయే ఆటతీరు కనబరిచారు.
విండీస్ చిచ్చరపిడుగు షిమ్రాన్ హెట్మెయర్ (13 బంతుల్లో 33) కూడా మెరుపులు మెరిపించాడు. అయితే ఇన్నింగ్స్ చివరి ఓవర్లో నటరాజన్.. హెట్మెయర్, రియాన్ పరాగ్ (12)ను అవుట్ చేశాడు. లేదంటే కనీసం రాజస్థాన్ మరింత స్కోరు చేసేదే. సన్రైజర్స్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ చెరో రెండు వికెట్లు తీయగా.. భువనేశ్వర్, రోమెరియో షెఫర్డ్ తలో వికెట్ తీసుకున్నారు. సన్రైజర్స్ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది.