సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు బ్యాటింగ్ నిలకడగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టుకు తొలి బంతికే షాక్ తగిలింది. నెమ్మదిగా ఫామ్లోకి వస్తున్నాడని అనుకున్న కోహ్లీ (0) గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరాడు. దీంతో మరోసారి బెంగళూరు బ్యాటింగ్ పతనం అవుతుందని భయపడిన అభిమానులకు..
కెప్టెన్ డుప్లెసిస్ (45 నాటౌట్), రజత్ పటీదార్ (44 నాటౌట్) నమ్మకం కలిగించారు. ఇద్దరూ ధాటిగా ఆడుతూనే వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. ఈ క్రమంలోనే పది ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు జట్టు ఒక వికెట్ నష్టానికి 93 పరుగులు చేసి భారీ స్కోరు దిశగా సాగుతోంది.