గుజరాత్ టైటన్స్తో జరుగుతున్నమ్యాచ్లో సన్రైజర్స్కు మంచి ఆరంభం లభించింది. ఆరంభంలో తొలి నాలుగు ఓవర్లు ఆచితూచి ఆడిన అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ జోడీ.. పవర్ప్లే చివరి రెండు ఓవర్లలో ఉతికారేసింది. షమీ వేసిన ఐదో ఓవర్లో కెప్టెన్ విలియమ్సన్ ఒక ఫోర్, సిక్సర్ బాదగా.. ఫెర్గూసన్ వేసిన ఆరో ఓవర్లో అభిషేక్ ఏకంగా నాలుగు ఫోర్లు కొట్టాడు.
దీంతో పవర్ప్లే ముగిసే సరికి సన్రైజర్స్ జట్టు వికెట్లేమీ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. అంతకుముందు సన్రైజర్స్ బౌలర్లు మంచి ప్రదర్శన చేయడంతో గుజరాత్ను 162/7 స్కోరుకే సన్రైజర్స్ కట్టడి చేసిన సంగతి తెలిసిందే.