గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ తొలి వికెట్ కోల్పోయింది. అద్భుతంగా ఆడుతున్న అభిషేక్ శర్మ (42)ను రషీద్ ఖాన్ అవుట్ చేశాడు. రషీద్ ఖాన్ వేసిన షార్ట్ బాల్ను మిడ్వికెట్ మీదుగా బాదడానికి అభిషేక్ ప్రయత్నించాడు. కానీ సరిగా బంతిని కొట్టలేకపోవడంతో బౌండరీ దాకా వెళ్లలేదు.
దాన్ని అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న సాయి సుదర్శన్ సులభంగా అందుకోవడంతో అభిషేక్ ఇన్నింగ్స్ ముగిసింది. రషీద్ ఖాన్ తొలి వికెట్ తీసుకున్నాడు. అభిషేక్ అవుటవడంతో క్రీజులోకి రాహుల్ త్రిపాఠి వచ్చాడు. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిసేసరికి సన్రైజర్స్ జట్టు 75/1 స్కోరుతో నిలిచింది.