గుజరాత్ టైటన్స్ జట్టులో కొత్తగా అరంగేట్రం చేసిన తమిళనాడు కుర్రాడు సాయి సుదర్శన్ (11) అవుటయ్యాడు. మరో తమిళనాడు ప్లేయర్ నటరాజన్ బౌలింగ్లో బౌండరీ బాదిన అతను.. ఆ తర్వాతి బంతికే పెవిలియన్ చేరాడు. నటరాజన్ వేసిన బంతిని డ్రైవ్ చేసేందుకు సుదర్శన్ ప్రయత్నించాడు. కానీ బంతిని సరిగా అంచనా వేయలేకపోవడంతో సరిగ్గా టైమింగ్ చేయలేకపోయాడు.
దాంతో గాల్లోకి లేచిన బంతిని మిడాఫ్లో ఫీల్డింగ్ చేస్తున్న కేన్ విలియమ్సన్ సులభంగా అందుకున్నాడు. సుదర్శన్ అవుటవడంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యా క్రీజులోకి వచ్చాడు. వచ్చీ రావడంతోనే బౌండరీ బాదిన అతను పవర్ప్లేను తన స్టైల్లో ముగించాడు. సన్రైజర్స్ బౌలర్లు సత్తా చాటడంతో ఆరు ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది.