సన్రైజర్స్తో జరుగుతున్న మ్యాచ్లో డేవిడ్ మిల్లర్ (12) కూడా అవుటయ్యాడు. మార్కో జాన్సెన్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్లో మిల్లర్ భారీ షాట్ ఆడేందుకు ముందుకొచ్చాడు. అదే సమయంలో జాన్సెన్ షార్ట్ బాల్ వేయడంతో పుల్ చేసేందుకు ప్రయత్నించాడు. దాంతో టైమింగ్ మిస్ అయిన మిల్లర్.. మిడ్ వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న అభిషేక్ శర్మ వైపు సులభమైన క్యాచ్ పంపాడు.
దాన్ని అభిషేక్ అందుకోవడంతో మిల్లర్ పెవిలియన్ బాటపట్టాడు. 14 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ జట్టు 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో అభినవ్ మనోహర్తోపాటు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఉన్నారు. ఒక పక్క క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నా.. హార్దిక్ పాండ్యా మాత్రం క్రీజులో కుదురుకున్నాడు. దాంతో గుజరాత్ అభిమానులు భారీ స్కోరు కోసం అతనిపైనే ఆశలు పెట్టుకున్నారు.