చెన్నైపై భారీ లక్ష్య ఛేదనలో సన్రైజర్స్ జట్టు కష్టాల్లో మునిగిపోయింది. నిలదొక్కుకున్నాడని అనుకున్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ (47) ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. ప్రిటోరియస్ వేసిన బంతిని ఆడే క్రమంలో విలియమ్సన్ మిస్ అయ్యాడు. ఎల్బీ కోసం అప్పీల్ చేయగా అంపైర్ అవుట్ ఇచ్చాడు.
అయితే విలియమ్సన్ వెంటనే రివ్యూ కోరాడు. కానీ రిప్లేలో కూడా అతను క్లియర్గా అవుటని తేలడంతో మైదానం వీడాడు. దీంతో 126 పరుగుల వద్ద సన్రైజర్స్ జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. ఇంకా ఆ జట్టు విజయానికి 73 పరుగులు చేయాలి.