చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ బ్యాటింగ్ తడబడుతోంది. అభిషేక్ శర్మ (39), కేన్ విలియమ్సన్ శుభారంభం అందించినా కూడా మిడిలార్డర్ వైఫల్యం ఆ జట్టును దెబ్బతీసింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న రాహుల్ త్రిపాఠీ (0) డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఎయిడెన్ మార్క్రమ్ (17) వరుసగా రెండు సిక్సర్లు కొట్టి మూడో బంతికి మరో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో అవుటయ్యాడు.
శాంట్నర్ వేసిన పదో ఓవర్లో రెండు వరుస సిక్సర్లు బాదిన మార్క్రమ్.. ఆ తర్వాతి బంతిని లాంగాన్ మీదుగా బౌండరీకి తరలించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న జడేజాకు చిక్కాడు. దీంతో సన్రైజర్స్ జట్టు పది ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 89 పరుగులతో నిలిచింది.