సన్రైజర్స్ హైదరాబాద్పై చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (99) విశ్వరూపం చూపించాడు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. అతనికి డెవాన్ కాన్వే (85 నాటౌట్) నుంచి మంచి సహకారం లభించింది. ఇద్దరూ భారీ షాట్లతో అలరించడంతో చెన్నై భారీ స్కోరు చేసింది.
ఈ క్రమంలో 18వ ఓవర్లో బంతి అందుకున్న నటరాజన్.. రుతురాజ్ను పెవిలియన్ చేర్చాడు. నటరాజన్ వేసిన బంతిని కట్ చేయడానికి ప్రయత్నించిన రుతురాజ్.. బ్యాక్వర్డ్ పాయింట్లో భువనేశ్వర్ కుమార్కు సులభమైన క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ధోనీ (8) భారీ షాట్లు ఆడలేకపోయాడు. అతన్ని కూడా నటరాజనే పెవిలియన్ చేర్చాడు.
దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి చెన్నై జట్టు రెండు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. సన్రైజర్స్ బౌలర్లలో నటరాజన్ ఒక్కడే ఒక వికెట్ తీసుకున్నాడు.