హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక ఐ-లీగ్లో శ్రీనిధి దెక్కన్ జట్టు మళ్లీ టాప్లోకి దూసుకొచ్చింది. మంగళవారం జరిగిన మ్యాచ్లో శ్రీనిధి ఎఫ్సీ 4-0 తేడాతో రౌండ్గ్లాస్ పంజాబ్పై ఘన విజయం సాధించింది.
తమదైన ఆధిపత్యం ప్రదర్శించిన మ్యాచ్లో శ్రీనిధి తరఫున డేవిడ్ మునోజ్(30ని, 88ని) డబుల్ గోల్ చేయగా, షాబాజ్ఖాన్(12ని), దినేశ్సింగ్(62ని) గోల్స్ చేశారు. 12 మ్యాచ్ల్లో ఎనిమిది విజయాలతో శ్రీనిధి 25 పాయింట్లతో టాప్లో కొనసాగుతున్నది.