హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఐ లీగ్లో శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ జోరు కనబరుస్తున్నది. ఆదివారం జరిగిన పోరులో శ్రీనిధి ఎఫ్సీ 2-0తో నామ్దారి ఎఫ్సీపై విజయం సాధించింది. రిజ్వాన్ హసన్ రెండు గోల్స్తో అదరగొట్టాడు. తొలి అర్ధభాగంలో రిజ్వాన్ ఓ గోల్ చేసి శ్రీనిధి జట్టును ముందంజలో నిలుపగా.. సెకండ్ హాఫ్లో మరో గోల్తో జట్టు ఆధిక్యాన్ని పెంచడంతో పాటు మ్యాచ్ను విజయంతో ముగించాడు. ఇప్పటి వరకు ఆడిన 15 మ్యాచ్ల్లో శ్రీనిధి 32 పాయింట్లు ఖాతాలో వేసుకుంది.