Table Tennis | మకావు: చైనాలోని మకావు వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) వరల్డ్ కప్లో భారత స్టార్ టేబుల్ టెన్నిస్ ఆటగాళ్లు శ్రీజ ఆకుల, మనికా బాత్రాలు గ్రూప్ దశలోనే వెనుదిరిగారు. బుధవారం ఇక్కడ జరిగిన గ్రూప్ దశ రెండో రౌండ్లో ప్రపంచ 39వ ర్యాంకర్ శ్రీజ 1-3 (4-11, 4-11, 15-13, 2-11) తేడాతో నాలుగో ర్యాంకర్ అయిన చైనా అమ్మాయి చెన్ మెంగ్ చేతిలో ఓడింది. మనికా 0-4 (6-11, 4-11, 9-11, 4-11) తేడాతో చైనాకే చెందిన ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ మన్యు చేతిలో చిత్తైంది.