Akula Sreeja | బీరూట్:బీరూట్(లెబనాన్) వేదికగా జరుగుతున్న ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) టోర్నీలో భారత ప్యాడ్లర్లు అదరగొట్టారు. మహిళల సింగిల్స్లో తెలంగాణ అమ్మాయి, ప్రపంచ 47వ ర్యాంకర్ ఆకుల శ్రీజ.. 3-1 (6-11, 12-10, 11-5, 11-9) తేడాతో లక్సెంబర్గ్కు చెందిన సారా డి నుట్టెను ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. శ్రీజకు ఇది రెండో డబ్ల్యూటీటీ సింగిల్స్ టైటిల్. ఈ ఏడాది జనవరిలో ఆమె.. ఫీడర్ కార్పస్ క్రిస్టి టోర్నీలో విజేతగా నిలిచింది. ఇదే టోర్నీలో పురుషుల సింగిల్స్ విభాగంలో సత్యన్ జ్ఞానశేఖరన్ టైటిల్ నెగ్గగా పురుషుల డబుల్స్లో మానవ్ ఠాకూర్-మానుశ్ షా ద్వయం.. భారత్కే చెందిన ముదిత్ డాని- ఆకాశ్ పాల్ను ఓడించారు.