హైదరాబాద్, ఆట ప్రతినిధి: హకీంపేట క్రీడా పాఠశాలను రూ.13 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. స్పోర్ట్స్ స్కూల్లో జరుగుతున్న మెడికల్ క్యాంప్ను మంత్రులు శ్రీనివాస్గౌడ్, మల్లారెడ్డి శనివారం సందర్శించారు. ఇండోర్ స్టేడియంలో జిమ్నాస్టిక్స్ ప్లేయర్ల ప్రాక్టీస్ను మంత్రులు పరిశీలించారు. మెరుగైన క్రీడా శిక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.