నిజామాబాద్ స్పోర్ట్స్: ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్లో పతకాలు సాధించిన నిఖత్ జరీన్(స్వర్ణం), మహమ్మద్ హుసాముద్దీన్(కాంస్యం) నిజామాబాద్ వాసులు కావడం మన అదృష్టమని హెచ్ఎఫ్ఐ అధ్యక్షుడు జగన్మోహన్రావు అన్నారు. శుక్రవారం హుసామ్ సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘తెలంగాణలో ఇందూరు ఇప్పుడు బాక్సింగ్ అడ్డాగా మారిపోయింది. కోచ్ శంసుద్దీన్ కృషితోనే ఇది సాధ్యమైంది’ అని అన్నారు. ఈ సన్మాన సభలో జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, నీతూ కిరణ్, జిల్లా బాక్సింగ్ సంఘం ప్రతినిధులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.