మహబలిపురం: చెస్ ఒలింపియాడ్లో భారత్ దుమ్మురేపుతున్నది. తొలిసారి స్వదేశంలో జరుగుతున్న ఈ మెగాటోర్నీలో మన గ్రాండ్మాస్టర్లు పరాజయం ఎరుగకుండా.. దూసుకెళ్తున్నారు. భారత్ ఏ తరఫున గ్రాండ్మాస్టర్ హరికృష్ణ, తెలంగాణ యువ కెరటం అర్జున్ ఇరిగైసి సత్తచాటడంతో 3-1తో గ్రీస్పై విజయం సాధించింది. దిమిత్రోస్పై హరికృష్ణ విజయం సాధించగా.. అర్జున్.. మాస్తోవసిల్స్ను చిత్తు చేశాడు. విదిత్ గుజరాతి, శశికిరణ్ ‘డ్రా’లు నమోదు చేసుకోవడంతో.. భారత్ గెలుపు ఖాయమైంది. ఇక గ్రూప్-బిలో భారత్ 4-0తో స్విట్జర్లాండ్పై ఏకపక్ష గెలుపు నమోదు చేసుకుంది. భారత్-సి 3-1తో ఐస్లాండ్పై నెగ్గడంతో మూడో రోజు పోటీలను భారత్ ఘనంగా ముగించింది. మహిళల విభాగంలో భారత్ – ‘ఎ’ 3-1తో ఇంగ్లండ్పై నెగ్గగా.. భారత్-‘బి’ 3-1తో ఇండోనేషియాను చిత్తుచేసింది. ఆఖరి మ్యాచ్లో భారత్-‘సి’ 2.5-1.5తో ఆస్ట్రియాపై గెలుపొందింది.