న్యూఢిల్లీ : జాతీయ క్రీడా అవార్డులకు దరఖాస్తు గడవును పెంచుతూ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు రోజులు గడువు పొడిగిస్తూ అక్టోబర్ 1 తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ఈ ఏడాది నుంచి దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించనున్నారు. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘానికి, జాతీయ క్రీడా సంఘాలకు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సమాచారం అందజేశారు. క్రీడల్లో విశేష ప్రతిభ కనబరిచిన ప్లేయర్లు, కోచ్లకు అవార్డులను అందజేస్తున్న విషయం తెలిసిందే.