హైదరాబాద్, ఆట ప్రతినిధి: దేశానికి సరిపడా అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా ఫలితాలు సాధించేలా క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నామని అన్నారు.
జాతీయ టేబుల్ టెన్నిస్ (టీటీ) ర్యాంకింగ్ టోర్నీతో పాటు రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించిన ప్యాడ్లర్లను మంత్రి ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో అభినందించారు. వీరిలో ప్రణీత, వెంకట మహిమ కృష్ణ, శాన్వి బాశెట్టి, అదిరా చేతన్, శ్రీ కీర్తన, అర్జున్ ఉన్నారు. భవిష్యత్తులో ఇదే జోరు కొనసాగిస్తూ.. రాష్ర్టానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టటీ మెంటార్ రమేశ్ కుమార్, అహ్మద్, రామేశ్వర్ పాల్గొన్నారు.