హైదరాబాద్, ఆట ప్రతినిధి: భోపాల్ వేదికగా జరిగిన జాతీయ షూటింగ్ చాంపియన్షిప్లో రాణించిన రాష్ట్ర యువ షూటర్ రాపోలు సురభిని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ గురువారం అభినందించారు. మహిళల 50మీటర్ల విభాగంలో రజత పతకం సాధించిన సురభి.. ప్రపంచ షూటింగ్ చాంపియన్షిలో పాల్గొనే భారత జట్టు ప్రాబబుల్స్కు ఎంపికైంది. ఈ సందర్భంగా సురభి ప్రతిభను మెచ్చుకున్న మంత్రి..భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సురభి తల్లిదండ్రులు పాల్గొన్నారు.